షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ వెల్లడి
హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): షిర్డీలోని సాయిబాబా ఆలయానికి ఏప్రిల్ 25 నుంచి జూన్ 15 వరకు వివిధ రూపాల్లో రూ.47 కోట్ల మేర భక్తులు కానుకలు సమర్పించారు. ఈ నెలన్నర వ్యవధిలో 26 లక్షల మంది భక్తులు సాయినాథుడిని దర్శించుకున్నారు.
విరాళాల్లో రూ. 2.4 కోట్ల వరకు 2 వేల నోట్లే ఉండ డం గమనార్హం. హుండీ ఆదాయం రూ.9.83 కోట్లు, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా రూ.5.15 కోట్లు, ఆన్లైన్ విరాళం రూ.3.34 కోట్లు, చెక్కులు, డీడీల ద్వారా రూ.1.82 కోట్లు, మనీ ఆర్డర్ ద్వారా రూ.27.37 లక్షలు, రూ.1.17 కోట్ల విలువైన బంగారం, 52 కిలోల వెండి విరాళాలుగా వచ్చినట్లు తెలిపారు.