హైదరాబాద్ : (Anganwadis) తెలంగాణ రాష్ట్రంలో అద్దె భవనాల్లో నడుస్తున్న అంగన్వాడీ కేంద్రాలను సర్కారు స్కూళ్లల్లోకి తరలించాలని అధికారులు నిర్ణయించారు. స్కూళ్లల్లో గదుల అందుబాటును బట్టి మొత్తంగా 13-14 వేల అంగన్వాడీలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం ఇదే అంశంపై తెలంగాణ మహిళా శిశు సంక్షేమశాఖ, విద్యాశాఖ అధికారులు సంయుక్త సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుతానికి అద్దె భవనాల్లోని అంగన్వాడీలను సర్కారు స్కూళ్లల్లోకి తరలించాలని, ఇందుకు సర్కారు స్కూళ్లల్లో ఒక్కో గది చొప్పున అందుబాటులో ఉంచాలని నిర్ణయానికి వచ్చారు.
రాష్ట్రంలో 149 ఐసీడీఎస్ ప్రాజెక్ట్ల పరిధిలో 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 31,711 అంగన్వాడీలు, మరో 3,989 మినీ అంగన్వాడీలు ఉన్నాయి. వీటిలో కొన్నింటికి సొంతంగా భవనాలుండగా, మరికొన్ని ఇతరత్ర ప్రభుత్వ భవనాల్లో నడుస్తున్నాయి. మరో 15 వేల కేంద్రాలు ప్రాథమిక పాఠశాలల్లోనే నడుస్తున్నాయి. మొత్తంగా 58 శాతం అంగన్వాడీలు అద్దెభవనాల్లో నడుస్తున్నాయి. వీటికి మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులు నెలకు రూ.30-40 కోట్లు అద్దె రూపంలో చెల్లిస్తున్నారు. అద్దెల భారం నుంచి బయటపడేందుకు వాటిని సర్కారు స్కూళ్లకు తరలించాలని నిర్ణయం తీసుకున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యావిధానం పూర్వ ప్రాథమిక విద్యను పాఠశాల విద్యలో విలీనం చేయాలని స్పష్టం చేసింది. దీంతో అంగన్వాడీలు ఉంటాయా? ఉండవా? అన్న చర్చ నడుస్తున్నది. ఒకవేళ రాష్ట్రంలో ఎన్ఈపీని యథాతథంగా అమలుచేయాల్సి వస్తే, అంగన్వాడీలను ప్రాథమిక పాఠశాలల్లో విలీనం చేయాల్సి ఉంటుంది. దీనిపై భవిష్యత్లో ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటే, స్కూళ్లల్లో ఉన్నవాటిని అక్కడికక్కడే విలీనం చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ నిర్ణయం పరోక్షంగా ఎన్ఈపీని అమలు చేయడానికి సులువుగా ఉంటుందని అధికారులు చెప్తున్నారు.
చరిత్రలో ఈ రోజు : భారతదేశంలో భాగమైన జునాగఢ్ రాష్ట్రం
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే
శీతాకాలంలో డైట్లో ఆవపిండి చేర్చుకోండి.. ఆరోగ్యంగా ఉండండి!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..