హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): సాఫ్ట్వేర్, పర్యాటక రంగాలతోపాటు వ్యవసాయ ఆధారిత కుటీర పరిశ్రమలతో స్వయం సహాయక బృందాలను (ఎస్హెచ్జీ) అనుసంధానించి, మహిళా సాధికారతకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ఎస్హెచ్జీల సభ్యులకు ఆర్థిక తోడ్పాటు అందించి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని సూ చించారు. బుధవారం సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల బడ్జెట్ అంచనాల రూపకల్పనపై ఆ శాఖ మంత్రి ధనసరి సీతక్కతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్బంగా భట్టి మాట్లాడుతూ.. మారెట్లో ఆర్గానిక్ పంట ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉన్నందున ఎస్హెచ్జీలను ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు మళ్లించాలని సూచించారు. హైదరాబాద్ చౌరస్తాల్లో చిన్న పిల్లలను చూపిస్తూ యాచించే వారిని గుర్తించి పిల్లలను కాపాడటానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానలకు వచ్చే రోగుల అటెండర్లు, ముఖ్యంగా మహిళలకు షెల్టర్లు, ఆహార ఏర్పాట్లకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ గ్రామాల్లో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.