నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో ఓ గొర్రె రెండు తలల పిల్లకు జన్మనిచ్చింది. జక్రాన్పల్లి మండల కేంద్రానికి చెందిన తొగరి లక్ష్మణ్కు గొర్రెల మంద ఉంది. ఈ మందలోని ఓ గొర్రె ప్రసవించింది. ఆ గొర్రెకు పుట్టిన పిల్ల వింతగా రెండు తలలతో జన్మించింది. వింతగా జన్మించిన గొర్రె పిల్లను చూసేందుకు జనాలు తరలివస్తున్నారు. జన్యు లోపంతోనే ఈ రకంగా జన్మించి ఉండొచ్చని పశు వైద్య అధికారులు చెబుతున్నారు.