YS Sharmila | హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): వచ్చే ఎన్నికల్లో ఓటుకు నోటు దొంగలకు ఓట్లేయొద్దని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. సోమవారం లోటస్పాండ్లో ఆమె మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో దొంగలను తరిమికొట్టాలని, దొంగలను ముఖ్యమంత్రులను చేయొద్దంటూ రేవంత్ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
‘రేవంత్ను నేను దొంగ అనడం లేదు. ఓటుకు నోటు కేసులో తనపై ఉన్న కేసును కొట్టివేయాలని ఆయన సుప్రీంకోర్టుకు పోయిండు. ఆ కేసును కొట్టివేయడం కుదరదు. ఆ కేసు ముందుకు సాగాలి. ఆ కేసులో రేవంత్సహా అందరూ దోషులే.. దొంగలే’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందని షర్మిల వివరించారు. ఇటీవల రేవంత్రెడ్డిని రేటెంతరెడ్డి అని ముద్దుగా పేరు పెట్టింది తాను కాదని స్పష్టం చేశారు.