హైదరాబాద్ సిటీబ్యూరో, మే (నమస్తే తెలంగాణ): పోక్సో కేసులో బాధితురాలి వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, వీడియోలను వివిధ సోషల్ మీడియా (ఎస్ఎం) వేదికల ద్వారా బహిర్గతం చేసిన వారిపై కేసు లు నమోదు చేస్తున్నట్టు పేట్బషీరాబాద్ పోలీసులు వెల్లడించారు. పోక్సో చట్టం కింద నమోదైన ఎఫ్ఐఆర్ నం.684/2026లో బాధితురాలి ఫొటోలు, వీడియోలు, ఆమె తల్లిదండ్రు ల వివరాలను సోషల్మీడియాలో ప్రసారం చేస్తున్నట్టు మేడ్చల్-మలాజిగిరి జిల్లా బా లల సంక్షేమ కమిటీ చైర్పర్సన్ ఫిర్యాదు చేశా రు.
ఈ మేరకు పేట్ బషీరాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ నం.706/2026, జువెనైల్ జస్టిస్ చట్టంలోని సెక్షన్ 74, సెక్షన్ 72(1) ఆఫ్ బీఎన్ఎస్, పోక్సో చట్టంలోని సెక్షన్ 23 కింద ఆయా వేదికల బాధ్యులపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. వాటిని ప్రసారం చేస్తున్న ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఖా తాల ఐడీలు, సంబంధిత యూఆర్ఎల్లను గుర్తించి, ఆయా ఖాతాదారులకు నోటీసులు పంపించినట్టు పోలీసులు తెలిపారు. మొత్తం 25 మంది సోషల్ మీడియా నిర్వాహకులు, ఇన్స్టా, ఫేస్బుక్ తదితర ఖాతాదారులను గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. త్వరలోనే వారి పూర్తి వివరాలు సేకరించి తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.