Shankar Luke | మైనారిటీ కమిషన్ వైస్ చైర్మన్గా శంకర్ లూక్ బాధ్యతలు స్వీకరించారు. ఖైరతాబాద్లోని మైనారిటీ కమిషన్ కార్యాలయంలో బుధవారం బాధ్యతలు స్వీకరించగా.. హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాజీవ్ సాగర్ మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో మైనార్టీలకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వివరించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మైనార్టీలు అణచివేతకు గురైతే.. తెలంగాణలో మాత్రం హాయిగా జీవిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు స్టీఫెన్ సన్, ముఠా గోపాల్, మాణిక్ రావు, మైనారిటీ కమిషన్ చైర్మన్ తారిఖ్ అన్సారీ, బీసీ కమిషన్ చైర్మన్ వకులభరణం కృష్ణమోహన్ రావు పాల్గొన్నారు.