హైదరాబాద్, ఫిబ్రవరి 3(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వ్యవహారాల సలహాదారుగా మహమ్మద్ అలీ షబ్బీర్ శనివారం సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు, బీసీ కమిషన్ చైర్మన్ కృష్ణమోహన్రావు, ఢిల్లీలో ప్రభుత్వ సలహాదారు మల్లు రవి, జీఏడీ కార్యదర్శి రఘునందన్రావు, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఉమర్ జలీల్, గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి నవీన్ నికోలస్ తదితరులు షబ్బీర్ అలీకి శుభాకాంక్షలు తెలిపారు.