హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ) : ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. పెద్దాపురం మండలం రాగంపేటలో నిర్మాణంలో ఉన్న ఓ ఫ్యాక్టరీలోని ఆయిల్ ట్యాంకర్లో దిగి ఏడుగురు కార్మికులు మృతిచెందారు. ట్యాంకర్ను శుభ్రం చేయడానికి దిగిన కార్మికులు, ఒకరి తర్వాత ఒకరు ఊపిరాడక మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతుల్లో ఐదుగురిని పాడేరుకు చెందినవారిగా గుర్తించారు. ప్రమాదంలో మరణించిన ఏడుగురికి ప్రభుత్వం రూ.25 లక్షల ఆర్థిక సహాయం అందిచనున్నట్లు కలెక్టర్ కృతిక శుక్లా తెలిపారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఫ్యాక్టరీని సీజ్ చేశామని వివరించారు.