SCR Awards | హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): దక్షిణ మధ్య రైల్వేకు ఏడు నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డులు దక్కాయని శనివారం రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఏడాదిలో చేసిన విద్యుత్తు పొదుపునకు ఈ అవార్డులు వరించాయని పేర్కొన్నారు. ఈ నెల 14 నుంచి 21 వరకు ఇంధన పొదుపు వారోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నామని తెలిపారు.
ఈ నేపథ్యంలో కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ అవార్డులను ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. మొత్తంగా ప్రథమ, ద్వితీయ బహుమతులు రెండు చొప్పున రాగా.. మెరిట్ సర్టిఫికెట్ మూడు వచ్చినట్టు వెల్లడించారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని హైదరాబాద్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టం (పీఆర్ఎస్)నకు, విజయవాడలోని వ్యాగన్ డిపోకు మొదటి బహుమతులు, దక్షిణ మధ్య రైల్వే జోన్కు, లేఖా భవనానికి రెండో బహుమతులు వచ్చాయని పేర్కొన్నారు. రేణిగుంట, గుంతకల్ రన్నింగ్ రూంలతోపాటు డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్కు మెరిట్ సర్టిఫికెట్లు దక్కాయని తెలిపారు.