శంషాబాద్ రూరల్, ఆగస్టు 25: బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఓ ముఠాను గురువారం శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. శ్రీలంక దేశానికి చెందిన 9 మంది ప్రయాణికులు శంషాబాద్ ఎయిర్పోర్టులో దిగారు. వీరు బంగారాన్ని శరీర భాగాల్లో దాచుకొని తీసుకువచ్చినట్టు అధికారులు గుర్తించారు. దాంతో వారిని తనిఖీ చేయగా 7.30 కిలోల బంగారం బయటపడింది. బంగారం విలువ రూ.3.80 కోట్లు ఉంటుందని తెలిపారు. పట్టుబడిన వారిలో కొందరు మహిళా ప్రయాణికులు ఉన్నారని వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.