వరంగల్ : వరంగల్ పోలీసు కమిషనరేట్కు చెందిన టాస్క్ ఫోర్స్ పోలీసులు ఏజే మిల్స్ కాలనీ, మఠ్వాడా ఏరియాలోని ఐదు పాన్ షాపులు, రెండు కిరణా దుకాణాల్లో బుధవారం ఉదయం తనిఖీలు నిర్వహించారు. నిషేధిత పొగాకు ఉత్పత్తులను పోలీసులు సీజ్ చేశారు. మొత్తం రూ. 24,780 విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
అరెస్టు అయిన వారిలో వంగరి అరుణ్(పోచమ్మ మైదాన్), రవ్వ ప్రసాద్(పిన్నవారి వీధి), అమీర్శెట్టి శ్రీనివాస్(వంచనగిరి గ్రామం), లింగం నర్సింహ(ఇల్లంద గ్రామం), మదర్(గవిచర్ల గ్రామం), జంగం శారద(శంభునిపేట), కలురామ్(పిన్నవారి వీధి) ఉన్నారు.