హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): శాసనసభ సమావేశాల్లో నీటిపారుదలశాఖపై శ్వేతపత్రం విడుదల చేస్తామని తొలుత చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. చివరకు విడుదల చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం.. ఆర్థిక, విద్యుత్తు, నీటిపారుదల శాఖలపై చర్చించాలని భావిస్తున్నదని శాసనసభలోనే ప్రభుత్వం చెప్పింది.
ఈ మేరకు బుధవారం ఆర్థికశాఖపై శ్వేతపత్రం విడుదల చేయగా, గురువారం విద్యుత్తు శాఖ స్థితిగతులపై విడుదల చేశారు. శుక్రవారం నీటిపారుదల శాఖపై శ్వేతపత్రం ఉంటుందని, అసెంబ్లీ కొనసాగుతుందని అందరూ భావించారు. కానీ, ఆ శాఖపై ఎలాంటి శ్వేతపత్రం లేకుండానే ప్రస్తుత శాసనసభ సమావేశాలను ముగిస్తున్నట్టు ప్రకటించారు.