హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు అత్యధిక వేతనాలు చెల్లిస్తున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఉద్యోగులకు కొత్త పేసేల్ అమలు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఆదివారం సెర్ప్ ఉద్యోగసంఘాల ప్రతినిధులు ఆమెను కలిసి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో నాటి పాలకులు సెర్ప్ ఉద్యోగుల డిమాండ్లను ఏనాడూ పట్టించుకోలేదని చెప్పారు. స్వరాష్ట్రంలో ప్రభుత్వోద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించి వారి జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు. రాష్ట్రప్రభుత్వ తాజా నిర్ణయంతో 3,974 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని వివరించారు.
మంత్రి నిరంజన్రెడ్డిని కలిసిన ఉద్యోగులు
సెర్ప్ ఉద్యోగులకు పేసేల్ అమలు చేయడాన్ని హర్షిస్తూ సెర్ప్ ఉద్యోగ సంఘాల నాయకులు మినిస్టర్స్ క్వార్టర్స్లో ఆదివారం వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం జీవోను విడుదల చేసిందని వారు ధన్యవాదాలు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో సెర్ప్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుంట గంగాధర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుదర్శన్, రాష్ట్ర, వనపర్తి జిల్లా నేతలు సకృనాయక్, నర్సయ్య, సుభాశ్, రేణుకాదేవి, శ్రీనివాసులు, బుచ్చన్న, రాంబాబు, వెంకన్న, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.