హైదరాబాద్ : మునుగోడు విజయం పట్ల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృషిని ఆ నియోజకవర్గం పరిధిలోని తాందారి పల్లె గ్రామస్తులు కొనియాడారు. ఈ సందర్భంగా మినిస్టర్స్ క్వార్టర్స్లో మంత్రి దయాకర్ రావును తాందారి పల్లె గ్రామస్తులు, సెర్ప్ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు, ఏపీఎంలు, సీసీలు కలిశారు. మంత్రికి పుష్ప గుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికలో తనకు సహకరించిన వాళ్లకు మంత్రి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తాందారి పల్లె గ్రామ ప్రముఖులు, సెర్ప్ ఉద్యోగ సంఘాల రాష్ట్ర జేఏసీ నాయకులు కుంట గంగాధర్, నరసయ్య, వెంకట్, సుదర్శన్, సురేఖ, సుభాష్, జానయ్య, మునుగోడు నియోజకవర్గం నుంచి ఏపీఎంలు, సీసీలు తదితరులు పాల్గొన్నారు.