హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 19: కాకతీయ యూనివర్సిటీలోని గర్ల్స్ హాస్టల్లో సీనియర్ విద్యార్థినులు జూనియర్లను ర్యాగింగ్ చేశారు. జూనియర్ల ఫిర్యాదు మేరకు అధికారులు సీనియర్లను తీవ్రస్థాయిలో హెచ్చరించారు. అధికారులు ర్యాగింగ్పై అవగాహన కల్పించకపోవడంతోనే స్నేహపూరిత వాతావరణంలో ఉండాల్సిన విద్యార్థినులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శలొస్తున్నాయి. ఈ విషయంపై కేయూ హాస్టల్ డైరెక్టర్ వెంకయ్యను వివరణ కోరగా.. సీనియర్లు పరిచయాల పేరిట ర్యాగింగ్ చేసినట్టు కొత్తగా హాస్టల్కు వచ్చిన విద్యార్థినులు తెలిపారని వెల్లడించారు. దీంతో సీనియర్ విద్యార్థినులను హెచ్చరించి జూనియర్లకు క్షమాపణ చెప్పించినట్టు తెలిపారు.