సిద్దిపేట : సీనియర్ జర్నలిస్ట్, ఈనాడు సిద్దిపేట స్టాఫర్ చింత నాగరాజు అకాల మరణం పట్ల మంత్రి హరీష్ రావు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. జర్నలిస్టు నాగరాజు కరోనాకు బలవడం తన మనసును కలిచివేసిందని హరీష్ రావు కంటతడి పెట్టుకున్నారు. ఒక ఆత్మీయుణ్ణి కోల్పోయాన్నారు. జర్నలిస్టుగా నిరాడంబరతకు, నిబద్ధతకు మారుపేరుగా అతను అందించిన సేవలను కొనియాడారు. జర్నలిస్టుగా ఆయన వ్రాసిన కథనాలు తనకు ఎంతో స్పూర్తినిచ్చాయి అని హరీష్ రావు పేర్కొన్నారు. ఎంత ప్రయత్నం చేసిన బ్రతికించుకోలేక పోయాం. ఒక గంట క్రితమే మాట్లాడిన వ్యక్తి ఇప్పుడిక లేడు అనే విషయం కలచి వేస్తుంది. నాగరాజు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. నాగరాజు కుటుంబ సభ్యులకు మంత్రి హరీష్ రావు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.