హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 6 (నమస్తే తెలంగాణ): మయన్మార్ ప్రధాని మనవరాలితోపాటు మరో 15 మంది నిరుపేద చిన్నారులకు గుండె సంబంధిత చికిత్స అందించినట్టు హైదరాబాద్లోని రెయిన్బో హాస్పిటల్ ఓ ప్రకటనలో పేర్కొన్నది. ‘ఆ దేశ ప్రధాని మనవరాలికి 9 నెలలు. ఆ చిన్నారి పుట్టుకతోనే గుండె జబ్బుతో బాధపడుతున్నది. ట్రాన్స్క్యాథటర్ ప్రక్రియ ద్వారా చికిత్స చేస్తేనే బతుకుతుంది. గతంలో రెయిన్బో వైద్యుడు డాక్టర్ నాగేశ్వర్రావు కోనేటి ఆ దేశానికి వెళ్లి గుండె సంబంధిత చికిత్సలపై శిక్షణ ఇచ్చి వచ్చారు. దీంతో మయన్మార్ ప్రభుత్వం దవాఖానను సంప్రదించింది. వారి ఆహ్వానం మేరకు డాక్టర్ నాగేశ్వర్రావు, డాక్టర్ శ్వేతబక్రు మయన్మార్ వెళ్లి ఆ దేశ ప్రధాని మనవరాలికి చికిత్స చేసి, మరుసటి రోజే డిశ్చార్జి చేశారు. చిన్నారులకు పునర్జన్మ ప్రసాదించిన వైద్యులను మయన్మార్ నావికాదళ చీఫ్ కమాండర్ ఘనంగా సన్మానించారు’ అని వెల్లడించింది.