హైదరాబాద్: మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మరోసారి మండిపడ్డారు. మూసీ మురికి అంతా వాళ్ల నోట్లోనే ఉంది. ఇంకా శుద్ధి ఎందుకు.. లక్షన్నర కోట్లు ఖర్చు ఎందుకు? అని ప్రశ్నించారు. మంత్రికి లీగల్ నోటీసులు పంపామని చెప్పారు. కాంగ్రెస్ అసహ్యకరమైన, విసుగు పుటించే రాజకీయాలు చేస్తున్నదని విమర్శించారు. మంత్రిని, సీఎంని మానసిక ఆరోగ్య నిపుణుడి వద్దకు లేదా రీహాబిటేషన్ సెంటర్లకు ట్రీట్మెంట్కు పంపించాలంటూ ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీని కేటీఆర్ కోరారు.
మూసి మురికి అంతా వాళ్ల నోట్లోనే…
ఇంకా శుద్ధి ఎందుకు.. లక్షన్నర కోట్లు ఖర్చు ఎందుకు?
Served legal notices to the Minister; Disgusting & Nauseating politics by Congress
Request @RahulGandhi to send your Minister & CM to a mental health specialist or a rehabilitation… pic.twitter.com/cL8AI1RqHk
— KTR (@KTRBRS) October 2, 2024
అంతకుముందు మూసీ కూల్చివేతల భయంతో గానద శ్రీకుమార్ అనే మేస్త్రీ గుండెపోటుతో మరణించడంపై కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి కట్టుకున్న ఇంటికి రూ.25 వేలు ఇస్తామని అధికారులు ప్రకటించడంపై ఫైరయ్యారు. గుండెలు ఆగిపోతున్నా, కుటుంబాలు విడిపోతున్నా సర్కార్ దాహం తగ్గడం లేదంటూ విమర్శించారు. కష్టపడి పస్తులుండి పైసా పైసా కూడేసి, బ్యాంకు నుంచి అప్పు తెచ్చి కట్టిన గుడును కూల్చుతారని భయంతో ప్రాణాలు పోతున్నాయని వాపోయారు. 16 కాదు 18 మంది అయినా సరే ఒకే ఇంట్లో ఉమ్మడిగా ఉన్న కుటుంబాలను రోడ్డుకు ఈడ్చి కుటుంబాల్లో చిచ్చులు పెట్టిన మూర్కుడు రేవంత్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇండ్లు ఖాళీ చేస్తే డబుల్ బెడ్రూమ్తో పాటు రూ.25 వేల పారితోషకం అంటూ అధికారులు వెకిలి ఆఫర్లు ఇస్తున్నారని మండిపడ్డారు. కోటి ఆశలతో లక్షలు, కోట్లు వెచ్చించి కట్టుకున్న ఇండ్లకు రూ.25 వేలా అని ప్రశ్నించారు. ఓ సన్నాసి, అదే మీ అన్న ఇంటికి.. మీ మంత్రుల ఇంటికి, రూ.25 వేలు కాదు రూ.50 వేలు ఇస్తే కూల్చమంటారా ఓసారి అడుగు అంటూ సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు. ఇండ్లు పోతున్నాయి అనే భయంతో ఒక బుచ్చమ్మ, ఒక కుమారన్న ప్రాణాలు పోయాయన్నారు. నీ ధన దాహానికి, నీ స్కాములకు ఇంకా ఎన్ని ప్రాణాలు బలితీసుకుంటావో చెప్పు అంటూ ఎక్స్ వేదిగా ప్రశ్నించారు.
ఆగుతున్న గుండెలు – విడిపోతున్న కుటుంబాలు, అయినా తగ్గని సర్కార్ దాహం
కలల సౌధం ఖరీదు అక్షరాల 25 వేలు!
కష్టపడి పస్తులుండి పైసా పైసా కూడేసి – బ్యాంకు నుండి అప్పు తెచ్చి కట్టిన గుడును కూల్చుతారని భయం తో పోతున్న ప్రాణాలు
16 కాదు 18 మంది అయినా సరే ఒకే ఇంట్లో ఉమ్మడిగా ఉన్న కుటుంబాలను… pic.twitter.com/pd1IxEg7SU
— KTR (@KTRBRS) October 3, 2024