హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ) : క్రైస్తవ మతం స్వీకరించిన దళితులను ఎస్సీ హోదా నుంచి మినహాయించాలని మార్చిలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు కోట్లాది మంది హకులు, రిజర్వేషన్లను దూరం చేసేలా ఉన్నదని, దాన్ని పున:సమీక్షించాలని 10 నుంచి అన్ని జిల్లాల్లో సదస్సులు నిర్వహించనున్నట్టు అవాజ్, కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శులు అబ్బాస్, సైలాబ్బాబు వెల్లడించారు.
శనివారం ప్రకటన విడుదల చేశారు. సుప్రీంకోర్టు తన తీర్పును మరోసారి పున:సమీక్షించాలని కోరారు.