హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): జాతీయ ఇన్స్పైర్ పోటీల్లో తెలంగాణకు చెందిన 8 ప్రాజెక్టులు అత్యత్తుమంగా నిలిచి రాష్ట్రపతి భవన్లో నిర్వహించే ప్రదర్శనకు ఎంపికవ్వడంపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హర్షం వ్యక్తంచేశారు. పాఠశాల స్థాయిలోనే విద్యార్థుల్లోని వైజ్ఞానికతను వెలికితీసేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుండటంతోనే విద్యార్థులు జాతీయస్థాయిలో రాణించారని మంగళవారం మంత్రి ఓ ప్రకటనలో తెలిపారు. జాతీయస్థాయిలో పురస్కారాలకు ఎంపికైన విద్యార్థులను బాలశాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. తెలంగాణ విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్ట్లు నిరంతరం ప్రజలకు ఉపయోగపడేవని, ఇలాంటివి మన విద్యార్థులు రూపొందించడం ప్రసంశనీయమని పేర్కొన్నారు.