కుమ్రంభీం ఆసిఫాబాద్ : వాంకిడి మండల కేంద్రంలో పోలీసులు నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. సయ్యద్ ముస్తఫా అనే వ్యాపారి గోదాంలో గుట్యా ప్యాకెట్లు నిల్వ ఉంచినట్లు అందించిన పక్కా సమాచారం మేరకు ఎస్ఐ దీకొండ రమేశ్, సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా దాదాపు రూ.78వేల విలువైన గుట్కా ప్యాకెట్లు లభ్యం కాగా.. వాటిని స్వాధీనం చేసుకున్నారు. గోదాం యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్కడైనా ప్రభుత్వ నిషేధిత గుట్కా ప్యాకెట్లను అమ్మినట్లు తెలిస్తే వాంకిడి పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు. కార్యక్రమంలో ఏఎస్ పోశెట్టి, హెడ్ కానిస్టేబుల్ మధుసూధన్ తదితరులు పాల్గొన్నారు.