న్యాల్కల్, డిసెంబర్ 21 : అక్రమంగా తరలిస్తున్న 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని( Ration rice) స్వాధీనం చేసుకున్నట్టు జహీరాబాద్ సివిల్ సప్లయ్ డిప్యూటీ తహసీల్దార్ సాయిరవికుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. సంగారెడ్డి(Sangareddy) జిల్లా న్యాల్కల్ మండల మల్గి గ్రామం మీదుగా డీసీఎం వ్యాన్లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని గ్రామస్తులు పట్టుకుని హద్నూర్ పోలీసులకు అప్పగించారన్నారు. హద్నూర్ ఎస్ఐ రామనాయుడు పట్టుకున్న డీసీఎం వ్యాన్లోని బియ్యం బస్తాలను గురువారం తమకు అప్పగించారని, వాటిని సీవిల్ సప్లయ్ గోడౌన్కు తరలించినట్టు ఆయన తెలిపారు. బాధ్యులైన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటు పేర్కొన్నారు. ఆయన వెంట మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ దుర్గయ్య తదితరులు ఉన్నారు.