శంషాబాద్, అక్టోబర్ 4: ఇద్దరు ప్రయాణికులు అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో సోమవారం కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్కు చెందిన వేముల శ్రీనివాస్, అమ్రగొండ శ్రీనివాస్ కువైట్ నుంచి హైదరాబాద్కు వచ్చారు. వారి కదలికలు అనుమానాస్పదంగా కనిపించడంతో అధికారులు సోదా చేయగా.. ప్యాంటు జేబుల్లో రూ.6 లక్షల విలువైన 128.260 గ్రాముల బంగారం లభించింది.