మంథని, అక్టోబర్ 11: అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో.. ఓటర్లకు పంపిణీ చేసేందుకు తరలిస్తున్న సౌండ్ బాక్స్లను బుధవారం పెద్దపల్లి జిల్లా మంథనిలో అధికారులు పట్టుకున్నారు. కార్గో ద్వారా మంథని బస్టాండ్కు సౌండ్ బాక్స్లు వచ్చాయన్న పక్కా సమాచారం మేరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అధికారి సతీశ్ అక్కడికి చేరుకున్నారు. బస్టాండ్ ఆవరణలో 4 బాక్స్లను స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా మంథని-గోదావరిఖని ప్రధాన రహదారి వెంట ఉన్న భారత పెట్రోల్ పంప్ సమీపంలో 8 బాక్స్లు, రెండు ఆంప్లిఫైర్లను తరలిస్తుండగా పట్టుకున్నారు.