హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని పట్టుకున్నారు. శనివారం దోహా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఫేస్క్రీమ్ డబ్బాలో పెట్టి అక్రమంగా తరలిస్తుండగా అధికారులు తనిఖీలు నిర్వహించి 528 గ్రాముల బంగారాన్ని పట్టుకున్నారు. బంగారం విలువ రూ.20.44లక్షలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు పేర్కొన్నారు. సదరు వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.