హైదరాబాద్, ఫిబ్రవరి3 (నమస్తే తెలంగాణ): ఈ నెల 7 నుంచి 14 వరకు గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహించాలని కలెక్టర్లకు, మండలస్థాయి అధికారులకు, గ్రామ ప్రత్యేక అధికారులకు పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక ఆదేశాలను జారీ చేశారు. ఆయా అధికారులతో శనివారం మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
వేసవిలో నీటి సమస్య లేకుండా చూడాలని ఆదేశించారు. 15న నిర్వహించే ముగిం పు కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులను సన్మానించాలని ఆదేశించారు. గ్రామస్థాయిలో మహిళా, యువజన సంఘాలతో డ్రగ్స్, మద్యం, గుటా వంటి దురలవాట్ల ప్రభావాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.