సంగారెడ్డి : జోగిపేటలోని విత్తన అభివృద్ధి కార్పొరేషన్ కార్యాలయ ప్రాంగణంలో విత్తన ప్రాసెసింగ్ యూనిట్ను ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ శుక్రవారం ప్రారంభించారు. రూ. కోటి వ్యయంతో ఈ యూనిట్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఒక సీజన్లో 30 వేల క్వింటాళ్ల విత్తనాలను ప్రాసెస్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు. ప్రతి సీజన్లో పంట మార్పిడి ప్రాముఖ్యతను ఎమ్మెల్యే వివరించారు. రైతులకు మంచి దిగుబడి పొందడానికి ఇది సహాయపడుతుందని చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తిని మెరుగుపరిచేందుకు రైతులకు నిరంతరం మార్గదర్శకత్వం అందించాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో సీడ్ కార్పొరేషన్ చైర్మన్ కేశవులు, జిల్లా వ్యవసాయ అధికారి బి. నర్సింగ్ రావు, తదితరులు పాల్గొన్నారు.