వరంగల్ : ఎన్నికలు వచ్చినపుడు అన్ని రాజకీయ పార్టీలు వస్తాయి. అయితే ఎవరికి ఓట్లు వేస్తే మనకు మేలు జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది ఆలోచించాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు 17 వ డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గద్దె బాబుకు మద్దతుగా స్తంభంపల్లి, వసంతాపూర్, దుపకుంట గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డెబ్బై ఏండ్లలో జరుగని అభివృద్ధి టీఆర్ఎస్ పాలనలో ఆరేండ్లలో జరిగిందన్నారు. వందల కోట్లు కేటాయించి ఇంటింటికి నళ్లా నీళ్లు అందించామని తెలిపారు. నిండు మనసుతో టీఆర్ఎస్ అభ్యర్థి గద్దె బాబును భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి..
కరోనా పరీక్షల కోసం వచ్చి.. కన్నుమూశాడు
సీఎం కేసీఆర్ గొప్ప దైవభక్తుడు : మంత్రి కొప్పుల
నేల తల్లి బాగుంటేనే భవిష్యత్తు : మంత్రి ఐకే రెడ్డి
రష్యా తురుపుముక్క లెనిన్.. చరిత్రలో ఈరోజు
ఒకే దేశంలో వ్యాక్సిన్కు రెండు ధరలా?