Security | మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డిపై దాడి నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. దాడి నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎంపీలకు ప్రభుత్వం భద్రతను పెంచింది. ప్రస్తుతం ఉన్న 2ప్లస్2 భద్రతను 4 ప్లస్ 4గా పెంచింది. ఈ మేరకు అన్ని జిల్లాల అధికారులకు ఇంటెలిజెన్స్ డీజీ అనిల్కుమార్ ఆదేశాలు జారీ చేశారు.