మహబూబాబాద్, సెప్టెంబర్ 14(నమస్తే తెలంగాణ): మానుకోట కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గ విభేదాలు రచ్చకెకాయి. మహబూబాబాద్ అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్న మురళీనాయక్, కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్ వర్గీయుల మధ్య గొడవ జరిగింది. పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ముందే నాయకులు గొడవకు దిగడంతో ఆమె కంగుతిన్నారు. గురువారం మహబూబాబాద్లోని ఆర్తి గార్డెన్స్లో పార్లమెంట్ స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఎన్నికల పార్లమెంట్ ఇన్చార్జి, మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు. ముందుగా చాలామంది నాయకులను స్టేజీపైకి పిలిచారు. సమీక్ష సమావేశాన్ని ప్రారంభించారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతుండగా మహబూబాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న మురళీనాయక్ను స్టేజీ మీదకు పిలవకపోవడంపై ఆయ న వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ పోతరాజుతోపాటు మరికొందరు నాయకులు, కార్యకర్తలు గొడవకు దిగగా.. బలరాం నాయక్ వర్గీయు లు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. వేదికపైనున్న నేతలు జోక్యం తో గొడవ సద్దుమణిగింది. మీనాక్షి నటరాజన్ జోక్యంతో కిందే కొనసాగింంది. ఈ సమ యంలో చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధుల ను కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. ఇది తమ అంతర్గత సమావేశమని, ఎవరూ చిత్రీకరించొద్దని బయటకు పంపించారు. ఈ క్రమంలో మీడియా ప్రతినిధులు కొందరు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమీక్ష సమావేశానికి రమ్మని ఆహ్వానించి అవమానిస్తారా? అంటూ మండిపడ్డారు.