హైదరాబాద్, అక్టోబర్ 19(నమస్తే తెలంగాణ): విజిలెన్స్ అవేర్నెస్ వీక్-2023 కార్యక్రమాల్లో భాగంగా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) కార్యదర్శి డేనియల్ బుధవారం హైదరాబాద్లోని జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ఎండీసీ) ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఎన్ఎండీసీ సీఎండీ (అదనపు బాధ్యతలు) అమితవ ముఖర్జీ, కార్యదర్శి బీ విశ్వంతహ్ సహా ఇతర అధికారులు, సిబ్బందితో ఆయన సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ‘అవినీతికి నో చెప్పండి – దేశంపట్ల నిబద్ధతను కలిగి ఉండండి’ అనే నినాదంతో ఈ ఏడాది విజిలెన్స్ అవేర్నెస్ వీక్-2023ని నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు.