Paper Leak | హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): పదో తరగతి పరీక్షల సమయంలో లీకేజీలను అరికట్టేందుకు విద్యాశాఖ పటిష్ట చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా తొలిసారి ప్రశ్నాపత్రాలపై సీక్రెట్ సెక్యూరిటీ కోడ్ను ముద్రించనుంది. పరీక్షల కోసం రూపొందించిన అన్ని ప్రశ్నాపత్రాల్లో ఈ సీక్రెట్ సెక్యూరిటీ కోడ్ ఉంటుంది. ఈ కోడ్ ద్వారా ఎవరైనా పేపర్ను లీక్ చేస్తే గంటల వ్యవధిలోనే పట్టుకోవచ్చు. కాగా పదో తరగతి పరీక్షలు మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరగనున్నాయి. ఈసారి 5.1 లక్షల మంది విద్యార్థులు పరీక్ష ఫీజును చెల్లించారు.
ఉద్యోగం శాశ్వతంగా తొలగింపు..
పేపర్ లీకేజీలకు పాల్పడిన వారిపై విద్యాశాఖ కఠిన చర్యలు తీసుకుంటుంది. గతంలో కొందరు ఇన్విజిలేటర్లు పదో తరగతి పేపర్లను లీక్ చేయడం, వాట్సాప్లో షేర్ చేయడం వంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని లీకేజీలకు పాల్పడిన వారిని కేవలం సస్పెన్షన్లతో సరిపెట్టకుండా ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తొలగిస్తుండటంతో టీచర్లు సైతం ఇలాంటి చర్యలకు సాహసించడం లేదు.
పరీక్షల్లో మార్పులివే..