DSC Exams Shedule | హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): డీఎస్సీలో భాగంగా సెకండరీ గ్రేడ్ టీచర్లకు (ఎస్జీటీలకు) ఆరు రోజులపాటు పరీక్షలు నిర్వహిస్తారు. అన్ని మీడియం అభ్యర్థులకు 12 సెషన్లపాటు పరీక్షలు జరుపుతారు. ఈ పరీక్షలను నవంబర్ 20 నుంచి 30 వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో నిర్వహిస్తారు. డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ బుధవారం నుంచి ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ బులెటిన్ను పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో పొందుపరిచింది.
పరీక్ష తేదీలతోపాటు పరీక్ష విధానాన్ని సైతం అధికారికంగా వెల్లడించింది. స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్, నాన్ లాంగ్వేజెస్, ఎస్జీటీ అభ్యర్థులకు 160 ప్రశ్నలకు పరీక్షను నిర్వహించనుండగా, ఒక్కో ప్రశ్నకు అర మార్కు చొప్పున కేటాయిస్తారు. ఇలా 80 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్), పీఈటీ పోస్టులకు పోటీ పడేవారికి మాత్రం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. వీరికి టెట్ పరీక్షను నిర్వహించకపోవడంతో టెట్ వెయిటేజీతో నిమిత్తం లేకుండానే 100 మార్కుల రాత పరీక్ష ఆధారంగా పోస్టులను భరీ ్తచేస్తారు. పరీక్షను 200 ప్రశ్నలకు నిర్వహించి, ఒక్కో ప్రశ్నకు ఆర మార్కును కేటాయిస్తారు.
డీఎస్సీ ద్వారా భర్తీ చేసే టీచర్ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ బుధవారం ప్రారంభమైంది. మొదటిరోజు 640 మంది అభ్యర్థులు ఫీజు చెల్లించగా, కేవలం 160 దరఖాస్తులు వచ్చినట్టు పాఠశాల విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.