జ్యోతినగర్, ఫిబ్రవరి 3: పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలోని 1600 మెగావాట్ల తెలంగాణ ప్రాజెక్టులోని రెండో యూనిట్లో శనివారం రాత్రి విద్యుదుత్పత్తి విజయవంతంగా పూర్తి సామర్థ్యానికి చేరుకున్నది. 800 మెగావాట్ల సామర్థ్యానికి గాను పూర్తిస్థాయిలో ఉత్పత్తి జరిగింది.
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణ కోసం కేటాయించిన 4 వేల మెగావాట్లలో ఫేజ్-1 కింద ఎన్టీపీసీలో నిర్మించిన అల్ట్రా సూపర్ క్రిటికల్ 1600 మెగావాట్ల తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టులో ప్రథమంగా 800 మెగావాట్ల ఒకటో యూనిట్ నిరుడు ఉత్పత్తి దశలోకి వచ్చింది. రెండో యూనిట్ నిర్మాణం పూర్తి కావడంతో మూడు రోజుల క్రితమే గ్రిడ్కు అనుసంధానం చేసి యూనిట్లో ఉత్పత్తిని కసరత్తు చేశారు. క్రమంగా విద్యుత్తు ఉత్పత్తి 800 మెగావాట్లకు చేరుకున్నది.