వరంగల్ : ప్రభుత్వ ప్రైవేటు వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ ప్రవేశాలకు రెండవ విడత కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ను కాళోజి వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసింది. మొదటి విడత అనంతరం ఖాళీగా ఉన్న సీట్ల ను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. కళాశాల వారిగా సీట్ల ఖాళీల వివరాలను వెబ్ సైట్ లో పొందుపరిచారు.
ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈనెల తేదీ 1వ తేదీ మధ్యాహ్నం 1 గంట వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్సైట్ www.knruhs.telangana.gov.in లో చూడవచ్చని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.