నల్లగొండ, నవంబర్ 15: సబ్సిడీ గొర్రెల కొనుగోలుకు మునుగోడు నియోజకవర్గం నుంచి నగదు బదిలీ పథకానికి శ్రీకారం చుట్టి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తే.. బీజేపీ కుట్రలు చేసి వారి ఖాతాల్లో నగదు పడకుండా అడ్డుకున్నదని గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు ఆరోపించారు.
గొల్లకురుమల పేరుతో మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి బీజేపీ కార్యకర్తలతో నిర్వహించిన ఆందోళనను ఖండించారు. మంగళవారం నల్లగొండలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో మీడియాతో మాట్లాడారు. రాజగోపాల్రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ధర్నాలు చేసినా గొల్ల కురుమలు విశ్వసించరన్నారు. బీజేపీ కుట్రల వల్ల ఫ్రీజ్ అయిన ఖాతాలను త్వరలో క్లియర్ చేసి లబ్ధిదారులందరికీ గొర్రెలు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.