రామగిరి, జనవరి 20 : నల్లగొండ జిల్లాలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీకి రెండోసారి ‘ఐఎస్ఓ’ గుర్తింపు దక్కింది. దీన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ (ఐఎస్ఓ) జారీ చేయగా గురువారం ఆ సంస్థ ప్రతినిధి ఆలపాటి శివయ్య ఎంజీయూలో వీసీ ప్రొఫెసర్ సీహెచ్ గోపాల్రెడ్డికి అందజేశారు.
ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఎంజీయూలో ఎనర్జీ సేవింగ్, గ్రీనరీ, ఎన్విరాన్మెంట్ అంశాలతోపాటు ఉన్నత ప్రమాణాలతో విద్య అందిస్తుండటంతోనే ఐఎస్ఓ వచ్చినట్లు తెలిపారు.
దీంతో యూనివర్సిటీకి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందన్నారు.
కార్యక్రమంలో యూనివర్సిటీ అభివృద్ధి అధికారి మారం నాగేందర్రెడ్డి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ మాధవి, సీఓఈ మిర్యాల రమేశ్, యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ సంధ్యారాణి పాల్గొన్నారు.