హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ) : ఖమ్మం జిల్లాకేంద్రంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో సెప్టెంబర్ 1 నుంచి 8 వరకు అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహిస్తున్నట్టు డిఫెన్స్ విభాగం తెలిపింది. గత ఏప్రిల్ 17 నుంచి 26 వరకు జరిగిన ఆన్లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (సీఈఈ)లో ఉత్తీర్ణులైన అభ్యర్థుల కోసం ఈ ర్యాలీని నిర్వహిస్తున్నారు.
అభ్యర్థులు అడ్మిట్కార్డులతోపాటు విద్యార్హత, పలు ధువ్రీకరణ పత్రాలను తీసుకురావాలని సూచించింది. సికు అభ్యర్థులు మినహా మిగతా వారు గడ్డంతో వస్తే ర్యాలీకి అనుమతించబోమని స్పష్టంచేసింది.