హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : యాదగిరిగుట్ట క్షేత్రంలోని స్కల్ప్చర్ (శిల్పకళ) ఇన్స్టిట్యూట్లో ఈ విద్యాసంవత్సరం నుంచి మూడేండ్ల ట్రెడిషనల్ స్కల్పర్ అండ్ ఆర్కిటెక్చర్ (టెంపుల్ ఆర్కిటెక్చర్) డిగ్రీ కోర్సును ప్రవేశపెట్టారు. దీని నిర్వహణకు జవహార్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్ఏఎఫ్ఏయూ) అనుమతులు మంజూరు చేసింది.
ఈ కోర్సులో 15 మంది విద్యార్థులకు మాత్రమే ప్రవేశాలు కల్పిస్తామని, నవంబర్ 21 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ ఆథారిటీ వైస్చైర్మన్ అండ్ సీఈవో జీ కిషన్రావు తెలిపారు. ఈ కోర్సును ఇప్పటికే టీటీడీ.. తిరుపతి, మహాబలిపురంలలో నిర్వహిస్తుండగా, ఈ వరుసలో యాదాద్రి కూడా చేరింది.