SI Exam | ఎస్సీటీ ఎస్ఐ (పీటీవో) టెక్నికల్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. హైదరాబాద్లోని పరీక్ష కేంద్రాల్లో నిర్వహించినట్లు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరిగిందని తెలిపింది. పరీక్షకు 594 మంది అభ్యర్థులు హాజరవగా.. 60.92 శాతం హాజరునమోదైందని పేర్కొంది. రిక్రూట్మెంట్ ప్రక్రియలో భాగంగా డిజిటల్ వేలిముద్రలు, డిజిటల్ ఫోటోగ్రాఫ్లు, అభ్యర్థి ప్రత్యేక గుర్తింపును నిర్ధారించడానికి అభ్యర్థుల బయోమెట్రిక్ ధ్రువీకరించినట్లు తెలిపింది. త్వరలోనే ఎస్సీటీ ఎస్ఐ పీటీవో టెక్నికల్ పేపర్ ప్రిలిమినరీ కీని విడుదల చేయనున్నట్లు పేర్కొంది. రాత ప్రశాంతంగా ముగిసిందని టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ వీవీ శ్రీనివాస్ రావు తెలిపారు. త్వరలోనే కీని వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు.