హైదరాబాద్: అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్యరైల్వే శుభవార్త అందించింది. సికింద్రాబాద్ నుంచి శబమరి వెళ్లే భక్తుల కోసం ఈ నెల 20 నుంచి 26 ప్రత్యేక రైళ్లను నడుపనున్నామని రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ సర్వీసులను వచ్చేఏడాది జనవరి వరకు కొనసాగుతాయని తెలిపారు. సికింద్రాబాద్ నుంచి కొల్లం, కొట్టాయంకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు.
సికింద్రాబాద్-కొల్లం (నం.07117): ఈ నెల 20, డిసెంబర్ 4, 18, జనవరి 8 తేదీల్లో నాలుగు సర్వీసులు. ఈ రైలు ఆదివారం సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్లో బయల్దేరి సోమవారం రాత్రి 11 గంటలకు కొల్లం చేరుకుంటుంది. ఇది కాచిగూడ, మహబూబ్నగర్, గద్వాల మీదుగా పయనించనుంది.
కొల్లం-సికింద్రాబాద్ (రైలు నం.07118): నవంబర్ 22, డిసెంబర్ 6, 20, జనవరి 10 తేదీల్లో నాలుగు సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు కొల్లంలో బయల్దేరుతుంది. మరుసటిరోజు 9.05 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
సికింద్రాబాద్-కొల్లం (నం. 07121): ఈ రైలు నవంబర్ 27, డిసెంబర్ 11, 25, జనవరి 1, 15 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఆదివారం మధ్యాహ్నం సికింద్రాబాద్లో బయల్దేరి.. సోమవారం రాత్రి కొల్లం చేరుతుంది. ఇది చర్లపల్లి, భువనగిరి, జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర మార్గంలో పయణిస్తుంది.
కొల్లం-సికింద్రాబాద్ (నం. 07122): ఈ రైలు నవంబర్ 29, డిసెంబర్ 13, 27, జనవరి 3, 17 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. మంగళవారం తెల్లవారుజామున 2.30 గంటలకు కొల్లం నుంచి బయల్దేరి.. బుధవారం ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది.
సికింద్రాబాద్-కొల్లం (నం. 07123): నవంబర్ 21, 28 తేదీల్లో రెండు సర్వీసులు నడువనున్నాయి. సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి.. మంగళవారం రాత్రి 11.50కి కొల్లం చేరుకుతంది. ఇది చర్లపల్లి, భువనగిరి, కాజీపేట, వరంగల్ మార్గం పయణిస్తుంది.
కొల్లం-సికింద్రాబాద్ (నం.07124): నవంబర్ 23, 30 తేదీల్లో రెండు సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. బుధవారం తెల్లవారుజామున 2.30 గంటలకు కొల్లం నుంచి బయల్దేరి.. గురువారం ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
సికింద్రాబాద్-కొట్టాయం (నం. 07125): ఈ రైలు నవంబర్ 20, 27 తేదీల్లో సేవలు అందించనుంది. ఆదివారం సాయంత్రం 6.50 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి.. సోమళవారం రాత్రి 9 గంటలకు కొట్టాయం చేరుకుంటుంది. ఇది చర్లపల్లి, నల్లగొండ, మిర్యాలగూడ మీదుగా వెళ్తుంది.
కొట్టాయం-సికింద్రాబాద్ (నం.07126): ఇది నవంబర్ 21, 28 తేదీల్లో నడుస్తుంది. సోమవారం రాత్రి 11.30 గంటలకు కొట్టాయం నుంచి బయల్దేరి.. బుధవారం ఉదయం 4 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది.