SCR Special Trains | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు తెలిపింది. సికింద్రాబాద్ – నుంచి కాకినాడ టౌన్, కాకినాడ టౌన్ నుంచి సికింద్రాబాద్ వరకు ప్రత్యేక రైళ్లు ఆగస్టు 31 నుంచి, సెప్టెంబర్ 1న రైళ్లు నడుపనున్నట్లు పేర్కొంది. ఈ నెల 31న రైలు నంబర్ 07441 సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి రాత్రి 9.25 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.45 గంటలకు కాకినాడ చేరుకుంటుందని చెప్పింది. సెప్టెంబర్ ఒకటిన రైలు నంబర్ 07442 కాకినాడ రైల్వేస్టేషన్ నుంచి రాత్రి 8.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకోనున్నది. ఆయా రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు జంక్షన్, విజయవాడ జంక్షన్, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట తదితర స్టేషన్లలో ఆగుతుందని పేర్కొంది. ఆయా రైళ్లను ప్రయాణికులు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసింది.
Special trains between Secunderabad-Kakinada Town- Hyderabad @RailMinIndia @drmsecunderabad @drmvijayawada @drmgnt pic.twitter.com/XolQIFC7DI
— South Central Railway (@SCRailwayIndia) August 29, 2023