హైదరాబాద్ : రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 19,800 ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్లు సోషల్మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని దక్షిణ మధ్య రైల్వే అధికారులు బుధవారం ప్రకటించారు. రైల్వే శాఖ నుంచి ఆర్పీఎఫ్ ఉద్యోగాల భర్తీ కోసం ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదన్నారు. ఆర్పీఎఫ్, రైల్వే మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో కూడా ఇలాంటి సమాచారం లేదన్నారు. సోషల్ మీడియాలో ప్రచారమయ్యే అసత్యపు వార్తలను నమ్మొద్దని సూచించారు. ఈ నోటిఫికేషన్ పూర్తిగా నకిలీదని రైల్వే అధికారులు తేల్చి చెప్పారు.