హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే చీఫ్ ఇంజినీర్ సురేశ్ కుమార్ లంచం తీసుకుంటూ సీబీఐ అధికారులకు పట్టుబడ్డాడు. ఉప్పల్ – జమ్మికుంట మధ్య రైల్వే పైవంతెన కాంట్రాక్టర్ నుంచి సురేశ్ రూ. 5 లక్షలు లంచం డిమాండ్ చేశారు. దీంతో సదరు కాంట్రాక్టర్ నిన్న నాచారంలోని సురేశ్ కుమార్ ఇంట్లో ఆయనకు రూ. 5 లక్షలు ఇస్తుండగా.. సీబీఐ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
నిన్న సాయంత్రం నుంచి నేటి ఉదయం వరకు సురేశ్ కుమార్ ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇవాళ ఉదయం సురేశ్ను అధికారులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. సికింద్రాబాద్ రైల్ నిలయంలో చీఫ్ ఇంజినీర్గా సురేశ్ విధులు నిర్వర్తిస్తున్నారు.