హైదరాబాద్: దానా తుఫాన్ (Cylone DANA) ప్రభావంతో వివిధ మార్గాల్లో 41 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. తుఫాను వల్ల ఒడిశా తీరప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో బుధవారం నుంచి ఈ నెల 27 వరకు పలు రైళ్లను ఎక్కడికక్కడే నిలిపివేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. రద్దయిన రైళ్లలో భువనేశ్వర్, హౌరా, ఖరగ్పూర్, పూరీ, తదితర ప్రాంతాల నుంచి బెంగళూరు, రామేశ్వరం, సికింద్రాబాద్, తిరుపతి , షాలీమార్, మాల్డా, గౌహతి, కన్యాకుమారి, చెన్నై, గోవా తదితర ప్రాంతాలకు వెళ్లే రైళ్లే ఎక్కువగా ఉన్నాయి.
బుధవారం రద్దయిన రైళ్లు ఇవే..
సికింద్రాబాద్-భువనేశ్వర్ విశాఖ ఎక్స్ప్రెస్, హైదరాబాద్-హౌరా, సికింద్రాబాద్-హౌరా, సికింద్రాబాద్-మాల్దా, షాలిమార్-హైదరాబాద్ రైళ్లు ఉన్నాయి. ఇక గురువారం వెళ్లనున్న హౌరా-సికింగ్రాబాద్, షాలిమార్-హైదరాబాద్, సిల్చార్-సికాంద్రాబాద్ ఎక్స్ప్రెస్ రైళ్లు రద్దయ్యాయి.