Odisha Train Accident | హైదరాబాద్ : ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఆయా మార్గాల్లో నడువాల్సిన పలు రైళ్లను రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. శనివారం, ఆదివారం కలిపి మొత్తం 23 రైళ్లు రద్దు చేశారు. అలాగే ఆదివారం తిరుపతి-హౌరా ఎక్స్ప్రెస్ను రద్దు చేశారు.
ఈ నెల 6న గౌహతి- బెంగుళూరు ఎక్స్ప్రెస్, ఈ నెల 7న కామాఖ్య-బెంగుళూరుకు వెళ్లాల్సిన రైళ్లు కూడా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. అలాగే మరో 26 రైళ్లను దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ – షాలిమార్ వెళ్లాల్సిన ఎక్స్ప్రెస్ రైలు 180 నిమిషాలు రీషెడ్యూల్ చేశారు. భువనేశ్వర్ – చెన్నై రైల్వే స్టేషన్ల మధ్య రెండు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తూ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు.