హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. భానుడి భగభగకు జనాలు విలవిలలాడిపోతున్నారు. గురువారం సాయంత్రం పలు చోట్ల వర్షం కురవడంతో, శుక్రవారం తెల్లవారుజాము వరకు వాతావరణం చల్లగానే ఉంది. ఇక ఉదయం 9 గంటల నుంచి ఎండలు మండిపోయాయి. ఉ. 11:30 గంటలకు ఉష్ణోగ్రతలు మరింత పెరిగిపోయాయి.
ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. హైదరాబాద్ నగరంలో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నప్పటికీ రాబోయే రెండు రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 48 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ కే నాగరత్న పేర్కొన్నారు.
ఆదిలాబాద్ – 45.1 డిగ్రీలు
నిజామాబాద్ – 45.1 డిగ్రీలు
జగిత్యాల – 45 డిగ్రీలు
నిర్మల్ – 44.8 డిగ్రీలు
మంచిర్యాల – 44.4 డిగ్రీలు
చార్మినార్ – 40.9 డిగ్రీలు
యూసుఫ్గూడ – 40.6 డిగ్రీలు
ఖైరతాబాద్ – 40.3 డిగ్రీలు
అంబర్పేట్ – 40.2 డిగ్రీలు
సరూర్ నగర్ – 40 డిగ్రీలు