హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 30 (నమస్తే తెలంగాణ): జాతీయ పోషకాహార సంస్థకు చెందిన సైంటిస్ట్ డాక్టర్ టీనా దాసి జాతీయ స్థాయిలో ఇచ్చే ఐసీఎంఆర్ అవార్డుకు ఎంపికయ్యారు. డాక్టర్ టీనా హిమోగ్లోబిన్ పరీక్షలకు అనువైన నూతన విధానాన్ని డెవలప్ చేయగా, దేశంలోని 30 అత్యుత్తమ ఆవిష్కరణల్లో ఒకటిగా నిలిచింది.
ఈ విధానం ద్వారా మహిళల్లో రక్తహీనతను వేగంగా, స్థానికంగానే గుర్తించడానికి వీలు ఉంటుందని చెబుతున్న ఎన్ఐఎన్ వర్గాలు డాక్టర్ టీనా కృషిని అభినందిస్తున్నాయి.