సిటీబ్యూరో, జనవరి 11(నమస్తే తెలంగాణ): ప్రపంచ శాంతిని సృష్టించేందుకు శాస్త్రీయతే కొలమానమని హార్వర్డ్ న్యూరో సైంటిస్ట్ డాక్టర్ టోని నాడర్ అన్నారు. హైదరాబాద్ శివారులోని కన్హ శాంతివనంలో గురువారం నిర్వహించిన గ్లోబల్ యూనియన్ ఆఫ్ సైంటిస్ట్స్ ఫర్ పీస్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తక్షణమే ప్రపంచ శాంతిని సృష్టించేందుకు, సానుకూల ప్రభావాలను ఉత్పత్తి చేయడానికి పురాతన వేద శాస్త్రం దోహదపడుతుందన్నారు.
స్పృహ ఆధారిత సాంకేతికతను కలిగి ఉన్నట్లు తెలిపారు. అనంతరం పద్మభూషణ్ కమలేశ్ పటేల్ మాట్లాడారు. ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన 10 వేల మందికి పొందికైన మెదడు పనితీరును నేరుగా త్రీడీ మ్యాపింగ్ ద్వారా ప్రదర్శించారు.